
రైల్వేస్టేషన్లో ప్రత్యేక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఆదేశాల మేరకు రైల్వే ఆర్పీఎఫ్ పోలీసుల సమన్వయంతో డీఎస్పీ రత్నరాజు, జీఆర్పీ సీఐ జె.వి. రమణ సిబ్బంది, డాగ్ స్క్వాడ్తో కలసి విజయవాడ రైల్వే స్టేషన్లో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణపై ప్రత్యేక తనిఖీలు చేశారు. స్టేషన్లోని ప్లాట్ఫాంలు, వెయిటింగ్ హాల్స్, క్లాక్ రూమ్లు, పార్సిల్ కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఒడిశా, విశాఖపట్నం మీదుగా వచ్చే అన్ని రైళ్లలోని జనరల్, స్లీపర్, ఏసీ కోచ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల రవాణపై విజయవాడ జీఆర్పీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నిరంతరం తనిఖీలు చేయడంతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ టీవీల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించడంలో పౌరులు, పోలీసులు స్నేహపూర్వక స్వభావంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులను గుర్తించినా, గంజాయి రవాణపై తెలిసినా సమాచారం అందించాల్సిందిగా ప్రయాణికులు, స్టేషన్లోని వెండర్స్, పోర్టర్లకు ఆయన సూచించారు. తనిఖీల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.