మూడు నెలల కోటా.. ఆరుసార్లు వేలిముద్ర | - | Sakshi
Sakshi News home page

మూడు నెలల కోటా.. ఆరుసార్లు వేలిముద్ర

Jun 2 2025 1:20 AM | Updated on Jun 2 2025 1:20 AM

మూడు నెలల కోటా.. ఆరుసార్లు వేలిముద్ర

మూడు నెలల కోటా.. ఆరుసార్లు వేలిముద్ర

డిచ్‌పల్లి: మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీకి తొలిరోజు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బయోమెట్రిక్‌లో మార్పులు చోటు చేసుకోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు, నిబంధనల మార్పుతో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. గతంలో రేషన్‌ తీసుకోవడానికి లబ్ధిదారుడు ఒకసారి బయోమెట్రిక్‌ వేసేవారు. ప్రస్తుతం ఒక నెల రేషన్‌కు రెండుసార్లు బయోమెట్రిక్‌ వేసేలా మార్పులు చేశారు. ఒకరికి 6 కిలోల బియ్యం ఇస్తుండగా, కేంద్రం వాటా 5 కిలోలకు ఒకసారి, రాష్ట్రవాటా 1 కిలోకి మరోసారి బయోమెట్రిక్‌ వేయాల్సి వస్తోంది. ప్రస్తుతం మూడు నెలల రేషన్‌ ఒకేసారి ఇస్తుండటంతో మొత్తం 6 సార్లు బయోమెట్రిక్‌ వేయాల్సి వస్తుండగా, ప్రతి వినియోగదారుడికి కనీసం 15–20 నిమిషాలు సమయం పడుతోంది. దీంతో ఇతర వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఓటీపీ విధానం రద్దు..

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాలలో మొ త్తం 165 రేషన్‌ దుకాణాలు ఉండగా 85 దుకాణాలకు మాత్రమే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బి య్యం సరఫరా అయింది. దీంతో పలు గ్రామాల్లోని రేషన్‌ షాపుల్లో ఇంకా బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. రేషన్‌కార్డులో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉంటే ఓటీపీ విధానంలో ఇతరుల సహాయంతో రేషన్‌ బియ్యం తీసుకునే వారు. ఈసారి ఆ విధానం రద్దు కావడంతో వారు సైతం రేషన్‌ దుకాణం వర కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుసార్లు వేలి ముద్ర విధానంతో వినియోగదారులకు ఇబ్బందు లు పడుతున్న దృష్ట్యా త్వరలోనే ఈ–పాస్‌ మిషన్‌ లో మార్పులు తెచ్చి ఒకేసారి వేలిముద్రతో బియ్యం తీసుకునేలా చేయాలని అధికారులు నిర్ణయించారు.

రేషన్‌ బయోమెట్రిక్‌లో మార్పులు

లబ్ధిదారుల ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement