
కార్మికులకు మేడే సెలవు ఇవ్వాలి
నిజామాబాద్ సిటీ: అన్ని రంగాల కార్మికులకు మేడే రోజున సెలవు అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కె సుధాకర్ మాట్లాడుతూ.. కార్మికులు సంఘటితం కాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికలోకం తి ప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, రాజేశ్వర్, సాయన్న, ఇంతియాజ్, ధర్మపురి, కిషన్, గంగన్న, లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గంగాధర్ పాల్గొన్నారు.
బయోటెక్నాలజీ
విద్యార్థులకు అభినందన
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రత్యూష, పవన్ ఇండియ న్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ నుంచి సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు ఎంపిక కావడం అభినందనీయమని వీసీ టి యాదగిరిరావు పేర్కొన్నా రు. ప్రత్యూష నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ రీసెర్చ్ సెంటర్, న్యూఢిల్లీలో పరిశోధనలు చేయనున్నారని, పవన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో పరిశోధనలు చేస్తారని విభాగాధిపతి ప్రసన్నశీల తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రత్యూషను వీసీ ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉచితంగా యోగా
మ్యాట్స్ పంపిణీ
సుభాష్నగర్: నగరంలోని సుభాష్నగర్లో ఉన్న దయానంద్ యోగా కేంద్రంలో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా యోగా మ్యాట్స్ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్షిత ఫౌండేషన్ చైర్మన్, సామాజికవేత్త సన్నీ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమని అన్నారు. ప్రతిఒక్కరూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని, పేదలకు సాయం చేయడమే అక్షిత ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో యోగా గురువు రాంచందర్, ఆర్చరీ కోచ్ ఎం మురళీ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు మేడే సెలవు ఇవ్వాలి

కార్మికులకు మేడే సెలవు ఇవ్వాలి