నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 30 2025 12:42 AM | Updated on Apr 30 2025 12:42 AM

నిర్మ

నిర్మల్‌

విహారం.. వినోదం
ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రకృతి సంపదకు నిలయం. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలెన్నో ఉండగా.. సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

IIలోu

పనుల పురోగతిపై సమీక్ష

లక్ష్మణచాంద: మండలంలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై డీఈవో రామారావు మంగళవారం మండలంలోని వడ్యాల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పాఠశాలల్లో ఇప్పటివరకు చేపట్టిన, చేపట్టాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని ఒడ్డెపెల్లి, బోరిగాం పాఠశాలల్లో సంబంధిత హెచ్‌ఎంలు, చైర్మన్లు పెండింగ్‌ పనులను రెండురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఈవో అశోక్‌వర్మ, పీఆర్‌ ఏఈ సంజయ్‌, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు రాజేశ్వర్‌, లింబాద్రి, చైర్మన్లు, సీఆర్పీ సుధాకర్‌ పాల్గొన్నారు.

కడెం: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో రామారావు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా పాఠశాల ల హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో షేక్‌ హుస్సేన్‌, పీఆర్‌ ఏఈ సూర్యతేజ తదితరులున్నారు.

‘ఏం సార్‌.. మొన్న మీబాబు మెయిన్‌రోడ్డుపై బైక్‌ నడుపుతున్నాడు. ఇప్పుడింకా టెన్త్‌ క్లాసే కదా సార్‌.. ఇప్పటి నుంచే అలా బండి నడపడం అవసరమంటారా..!?’ అని ప్రవీణ్‌ అంటుండగానే.. ‘అరె ఏం సార్‌.. మీరింకా ఏ జమానాలో ఉన్నారు. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల జమానా నడుస్తుంది. పిల్లలు అన్నిట్లో ఫాస్ట్‌ ఉండాలి. అన్ని నేర్చుకోవాలి. ఏజ్‌ది ఏముంది సార్‌..!? వాడికి బైక్‌ బాగానే వస్తుంది. ఈమధ్య ఏ పని ఉన్నా.. వాడికే చెబుతున్నాం కూడా..’ అంటూ శ్రీనివాస్‌ చెబుతూ ఉండటంతో ప్రవీణ్‌ సైలెంట్‌ అయిపోయాడు. సరిగ్గా వారం తర్వాత.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర శ్రీనివాస్‌ కనిపించడంతో ప్రవీణ్‌ ‘ఏమైందంటూ..’ పలకరించాడు. తన బాబు బైక్‌ నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టాడని, దీంతో తన కొడుకు ఎడమకాలు విరగడంతో పాటు వెనుక కూర్చున్న పిల్లాడికీ తీవ్రగాయాలయ్యాయని చెబుతూ, వాడికి బైక్‌ ఇచ్చినందుకు తనపైనా పోలీసు కేసు నమోదైందని తలదించుకున్నాడు. –నిర్మల్‌

గాలిలో కలుస్తున్న చిరు ప్రాణాలు

పోలీసుల హెచ్చరికలు బేఖాతరు

జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహణ

మైనర్లు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌

ప్రాణాలు పోయిన ఘటనలెన్నో..

ఇదొక్కటే కాదు.. ఇలాంటివెన్నో ఈమధ్య చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలూ పోయాయి. శ్రీనివాస్‌లాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ నేర్పాలన్న అత్యాశలో వయసుకు మించిన సాహసాలు, తప్పిదాలనూ చేయిస్తున్నా రు. తమ కొడుకు/బిడ్డ చిన్నవయసులోనే డ్రైవింగ్‌ చేస్తుండటం చూసి మురిసిపోతున్నారు. కానీ.. వారి వయసురీత్యా ఉండే మానసికస్థాయికి అది సరికాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈక్రమంలోనే తమ చేతులారా.. తమ పిల్లల ప్రాణాలు, ఎదుటివారి జీవితాలతోనూ ఆడుకుంటున్నారు. దీనిపైనే ఇటీవల పోలీస్‌శాఖ సీరియస్‌గా దృష్టిపెట్టింది. జిల్లాలో ఒకేరోజు వందకేసులు నమోదు చేసింది. చిన్నవయసులో డ్రైవింగ్‌ సరికాదని మానసిక వైద్యనిపుణులూ హెచ్చరిస్తున్నారు.

రెండేళ్ల క్రితం ఇలా..

రెండేళ్లక్రితం జిల్లాకేంద్రంలోనే ఓ పేరున్న బిల్డర్‌ బిడ్డ (మైనర్‌) కారు నడుపుతూ మంచిర్యాలరోడ్డులో బైక్‌పై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. ఇద్దరికి గాయాలయ్యాయి. అక్కడున్న వారందరూ ‘ఏంటమ్మా.. ఇంత చిన్నవయసులో కారు నడుపుతున్నావ్‌.. అది కూడా ఇంత స్పీడ్‌గా..’ అని ప్రశ్నిస్తే.. ‘మా నాన్నే నాకు నేర్పించారు. కారు కూడా ఆయనే ఇచ్చారు. మీరెవరు నన్ను అడగడానికి..’ అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో అక్కడున్నవారు సదరు బిల్డ ర్‌కు ఫోన్‌ చేసి మందలించారు.

పిల్లల డ్రైవింగ్‌.. పెద్దలపై కేసులు

18 ఏళ్లున్నవారే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి అర్హులు. లేనిపక్షంలో పిల్లలు వాహనాలు నడిపిస్తే.. సంబంధిత వాహన యజమానిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 199ఏ ప్రకారం బాలల డ్రైవింగ్‌పై కేసుల నమోదు ఉంటుంది. ఇటీవల జిల్లాలో పోలీసులు మైనర్‌ డ్రైవింగ్‌పై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. సదరు పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. కేసుల నమోదు, జరి మానాలు వసూలు చేస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీ స్‌స్టేషన్ల పరిధిలో మైనర్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. సుమారు 296 మంది మైనర్లు పోలీ సులకు పట్టుబడగా 100 మందిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం మైనర్ల తల్లిదండ్రులకు మో టార్‌ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు.

స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుకున్న వాహనాలు

డ్రగ్స్‌ రవాణా చేస్తే చర్యలు

నర్సాపూర్‌ (జి): మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా కఠినచర్యలు తప్పవని నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌ మీనా హెచ్చరించారు. సోమవారం రాత్రి నర్సాపూర్‌ (జి), చాక్‌పల్లి, తిమ్మాపూర్‌ (జి) గ్రామాల్లోని అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించా రు. మాదకద్రవ్యాల వినియోగిస్తే కలిగే నష్టా ల గురించి అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో నిర్మల్‌ రూరల్‌ సీఐ కృష్ణ, నర్సాపూర్‌ (జి), దిలావర్‌పూర్‌, సారంగపూర్‌, నిర్మల్‌ రూరల్‌ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

మానసిక సామర్థ్యం తక్కువ

మైనర్లకు మానసిక సామర్థ్యం తక్కువ. వాహనాల ను నడిపేటప్పుడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోలేక ప్రమాదాల బారిన పడుతుంటారు. మైనర్లకు వాహనాలిస్తే వారిని ప్రమాదంలోకి నెట్టినట్లే తల్లిదండ్రులు భావించాలి.

– సురేశ్‌ అల్లాడి, సైకియాట్రిస్ట్‌

అవగాహన కల్పిస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాం. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తిస్తున్నాం. పిల్లలతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది.

– జానకీషర్మిల, ఎస్పీ

18 ఏళ్లు నిండితేనే డ్రైవింగ్‌

మనకున్న నిబంధనల ప్రకారం 18ఏళ్లు ఉంటేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవచ్చు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటేనే వాహనాన్ని నడిపించాలి. లేనిపక్షంలో వాహనాలు నడిపితే చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలివ్వొద్దు.

– పీ దుర్గాప్రసాద్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

న్యూస్‌రీల్‌

రేపు భైంసాలో ప్రజావాణి

భైంసాటౌన్‌: పట్టణంలోని పాత రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోగల ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఎస్పీ జానకీ షర్మిల పోలీ స్‌ ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కా ర్యాలయంలో అందుబాటులో ఉండి సబ్‌ డివి జన్‌పరిధిలోని బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. భరోసా కేంద్రంలో కూడా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారు.

ఠాణా వాహనాలు

ఠాణా వాహనాలు

నిర్మల్‌ టౌన్‌ 10

భైంసా టౌన్‌ 10

నిర్మల్‌ రూరల్‌ 5

భైంసా రూరల్‌ 4

ఖానాపూర్‌ 6

కుభీర్‌ 3

కుంటాల 6

బాసర 5

లోకేశ్వరం 7

ముధోల్‌ 4

తానూరు 6

దస్తురాబాద్‌ 4

కడెం 4

పెంబి 1

దిలావర్‌పూర్‌ 3

నర్సాపూర్‌ 3

సారంగపూర్‌ 7

లక్ష్మణచాంద 6

మామడ 2

సోన్‌ 4

పిల్లలకు వాహనాలిస్తే కేసులు

నిర్మల్‌టౌన్‌: మైనర్లకు వాహనాలిచ్చే ఓనర్లపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకీ షర్మిల హెచ్చరించారు. ఆదివారం జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో మైనర్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పట్టుబడిన మైనర్ల తల్లి దండ్రులకు రెండో విడతగా మంగళవారం జి ల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ప్రొజెక్టర్‌ ద్వారా షార్ట్‌ ఫిలింస్‌, మైనర్‌ డ్రైవింగ్‌ కారణంగా జరిగిన ప్రమాదాల వీడియోలు చూపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే మైనర్లపై కేసులు నమోదు చేస్తే వారు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఎట్టి పరిస్థితుల్లోనే వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి, ఆర్‌ఐలు రాంనిరంజన్‌, శేఖర్‌, రమేశ్‌, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌1
1/4

నిర్మల్‌

నిర్మల్‌2
2/4

నిర్మల్‌

నిర్మల్‌3
3/4

నిర్మల్‌

నిర్మల్‌4
4/4

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement