
పొలంలోనే ఆగిన ఊపిరి
మంత్రాలయం: రెక్కల కష్టానికి రైతు పిచ్చగింట్లు శంకరన్న(45) ఎప్పుడూ భయడలేదు. పొలమే ప్రాణంగా జీవనం సాగిస్తూ వచ్చాయి. వివిధ పంటలు పండిస్తూ ఉండేవాడు. అయితే ఆ రైతును పొలంలోనే విద్యుత్ ప్రాణం తీసింది. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో మంత్రాలయం మండలం 52 బసాపురం గ్రామానికి చెందిన రైతు పిచ్చగింట్లు శంకరన్న, ఆయన భార్య పార్వతి బుధవారం పొలానికి గుంటక పాయడానికి వెళ్లారు. కరెంటు రావడంతో గుంటక పాస్తున్న శంకరయ్య బోరు మోటారు ఆన్ చేయడానికి బోరు దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటారు కనెక్షన్ విద్యుత్ తీగ డ్యామేజ్(అతుకులు) అయ్యింది. డ్యామేజ్ అయిన చోట అనుకోకుండా ఆ రైతు కాలు పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. భర్త మృతి చెందడంతో భార్య పార్వతి శోకసంద్రంలో మునిగిపోయింది. శంకరన్నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వీరేష్ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి