
వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు
మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ మా కుటుంబంపై వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి ఉపాధి పనులు కల్పించడం లేదు. ఫీల్డ్ అసిస్టెంటు, ఏపీఓను కలిసినా ఫలితం లేకపోయింది. ఉపాధి పనులు కల్పించడంలో రాజకీయాలు చూడరాదు. ఒక పార్టీ, ఒక వర్గానికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయ పనుల్లేక, ఉపాధి పనులు దక్కక ఇబ్బందులు పడుతున్నాం.
– సుభాన్, ఉపాధి కూలీ, గుడికంబాలి,
కౌతాళం మండలం
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఉపాధి పనులకు వచ్చిన వారికి మాత్రమే మస్టర్లు వేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. దొంగమస్టర్లకు తావు లేకుండా తనిఖీలను ముమ్మరం చేశాం. ఫాంఫాండ్స్ తవ్వకాల్లో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతాం.
– వెంకటరమణయ్య, పీడీ, డ్వామా, కర్నూలు
మాకింత.. మీకింత..
● ఉపాధిలో మితిమీరిన అక్రమాలు
● 50 శాతం పైగా దొంగ హాజరు
● వారంలో చేసిన పని ఆధారంగా
ముడుపులు
● ఫీల్డ్ అసిస్టెంట్లపై ఏపీఓ,
ఈసీ, టీఏల ఒత్తిడి
● పాత ఫాంపాండ్స్కే మెరుగులు
● మంత్రాలయం నియోజకవర్గంలో ఓ మండలానికి ఈసీ ఇన్చార్జి ఏపీఓగా వ్యవహరిస్తున్నాడు. వారానికి లక్ష రూపాయల పని జరిగితే రూ.20 వేలు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. మాకు ఇచ్చేది ఇచ్చి, మీరు ఎంతైన సంపాదించుకోండని ‘అవినీతి’ సలహా ఇస్తున్నాడు. లేదంటే ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేరని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
సంజామల మండలం
ఆకుమల్లలో మస్టర్
నెం.4513కి అప్లోడ్ చేసిన ఫొటో
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి నాయకులు ఉపాధి హామీ పనులను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే అప్పటి వరకున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ అనుచరులకు పట్టం కట్టారు. అది కూడా బేరం పెట్టి మరీ నియామకాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తమ చెల్లించుకున్న మొత్తాన్ని రాబట్టుకునే దిశగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ మొదలు ఏపీఓల వరకు అన్ని కేటగిరీల ఉద్యోగులు అవినీతిలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో 50 శాతం పైగా దొంగమస్టరు వేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి వారానికి లక్షకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు చర్చ జరగుతోంది. కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, హొలగొంద, ఓర్వకల్, క్రిష్ణగిరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, నందికొట్కూరు మండలాల్లో అవినీతి తంతు మితిమీరింది. టీడీపీకి చెందిన వారి ఇంట్లో ముగ్గురు, నలుగురు వరకు పనికి రాకపోయినప్పటికీ మస్టరు వేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఉపాధి పనులకు 97వేల మంది వరకు హాజరువుతున్నట్లు లెక్కలు ఉండగా.. వాస్తవానికి 40వేల మంది కూడా రావడం లేదని తెలుస్తోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో.. 50 శాతంపైగా దొంగమస్టరు వేస్తున్నట్లు సమాచారం.
పాత పనులకే మెరుగులు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఫాంపాండ్ తవ్వకాలకు పెద్దపీట వేశారు. అయితే గతంలో తవ్విన ఫాంపాండ్లకు మెరుగులు దిద్ది వందల మంది కూలీలు పనిచేసినట్లు మస్టరు వేసి ఒక్కో కూలీ పేరిట రోజుకు రూ.307 స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయం, పత్తికొండ, డోన్ నియోజక వర్గాల్లో ఈ తంతు పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ ఏడాది ఒక్క కర్నూలు జిల్లాలోనే 8,500 ఫాంపాండ్లు తవ్వాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 2వేల వరకు ఫాంపాండ్లు తవ్వారు. ఇందులో 75 శాతం పాత వాటికి మెరుగులు దిద్దినవే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
పండ్లతోటల అభివృద్ధిలో అంకెల గారిడీ
● 2023–24 సంవత్సరంలో ఈ–క్రాప్ ప్రకారం 11,202 ఎకరాల్లో పండ్లతోటలు ఉన్నాయి.
● 2024–25లో ఉపాధి నిధులతో 4,150 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు అంకెల ద్వారా తెలుస్తోంది.
● మరోవైపు ఉద్యాన శాఖ కూడా దాదాపు 1000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు స్పష్టమవుతోంది.
● ఈ ప్రకారం 2024–25లో పండ్లతోటల సాగు భారీగా పెరుగాలి.
● ఈ–క్రాప్ ప్రకారం 2024–25లో 11,650 ఎకరాల్లో పండ్లతోటల సాగు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
● 2023–24తో పోలిస్తే 2024–25లో కేవలం 448 ఎకరాల్లోనే పండ్లతోటల సాగు పెరగడం గమనార్హం.
● ఈ విషయంలో నిధులు భారీ ఎత్తున స్వాహా అవుతుండగా.. నిర్వహణ(మెయింటెనెన్స్) బిల్లులు దారి మల్లుతున్నట్లు తెలుస్తోంది.
సంజామల మండలం రెడ్డిపల్లెలో ప్రతి రోజు ఉపాధి హామీ పనులకు రాకపోయినా దాదాపు 50 మంది కూలీలకు ఫీల్డ్ అసిస్టెంట్ తమకు అనుకూలమైన వారికి హాజరు వేస్తున్నట్లు సమాచారం. స్థానిక టీడీపీ వర్గీయులు పనికి రాకపోయినా హాజరు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తాము వారం రోజులు పనిచేస్తే రెండు రోజులేచూపుతున్నారని, ఇంటి దగ్గర ఉన్న వారికి లబ్ధి చేకూరుస్తున్నారని పలువురు ఉపాధి కూలీలు వాపోతున్నారు.
కౌతాళం మండలం చూడి గ్రామంలో (వర్క్కోడ్: 0213001007/ ఐసీ/19185010164922)ఉపాధి పనికి కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. అయితే పీల్డ్ అసిస్టెంట్ మాత్రం ఏకంగా 28 మంది ఉపాధి పనికి వచ్చినట్లు మస్టర్(హాజరు) వేశాడు. అంటే రికార్డు స్థాయిలో 24 మంది పేర్లతో దొంగ మస్టర్లు వేయడం గమనార్హం.
.. ఉపాధి హామీ పథకంలో మితిమీరిన అవినీతికి ఈ రెండూ తాజా ఉదాహరణలు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, అధికార టీడీపీ నేతల జోక్యం అధికమవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దోపిడీ కొనసాగుతోంది.

వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు

వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు

వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు

వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు

వైఎస్సార్సీపీ ముద్ర వేసి పనులు కల్పించడం లేదు