
అండర్ వాటర్ వీడియోగ్రఫీకి సిద్ధం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం ప్లంజ్పూల్లో అండర్ వాటర్ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ సోమవారం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం నుంచి ప్లంజ్పూల్ నీటిలో పరిశోధన జరిపే పరికరాలను సిద్ధం చేస్తున్నారు. వాల్తేరు నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు శ్రీశైలండ్యాం వద్ద పరికర సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిపుణులు సోమవారం నుంచి ప్లంజ్పూల్లో ఏర్పడిన గోతులను, కాంక్రీట్ సిలండర్ల పటిష్టతను చిత్రీకరిస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు సమర్పిస్తారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన బ్యాతమెట్రిక్ సర్వే, అండర్ వాటర్ వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ నివేదికల ఆధారంగా ప్లంజ్పూల్ పనులు చేపడతారు.