రోడ్డు పక్కన దుర్గంధం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కన దుర్గంధం

Jun 30 2025 7:40 AM | Updated on Jul 1 2025 7:31 AM

రోడ్డు పక్కన దుర్గంధం

రోడ్డు పక్కన దుర్గంధం

కొండమల్లేపల్లి : పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం కూడా రోడ్డు పక్కన నిలవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీలో ఓ రైస్‌ మిల్లు నుంచి విడుదలైన మురుగు నీరు మొత్తం నిల్వ ఉండడంతో కొండమల్లేపల్లి నుంచి నల్లగొండకు వెళ్లే వాహనదారులకు విపరీతమైన దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వడ్లను ఉడకబెట్టిన నీరు మొత్తం కూడా ఇలా బయటికి వదలడంతో ఆ దుర్గందాన్ని భరించలేక వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి సదరు మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement