మా భూములు.. మాకే ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మా భూములు.. మాకే ఇవ్వాలి

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

మా భూములు.. మాకే ఇవ్వాలి

మా భూములు.. మాకే ఇవ్వాలి

కొండమల్లేపల్లి : మా భూమాలు.. మాకే ఇవ్వాలని కొండమల్లేపల్లి మండలం జానిగానితండా, దేవరోనితండా గిరిజన రైతులు మంగళవారం దేవరకొండ బస్టాండు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండ్లిపాకల రిజర్వాయర్‌ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురవుతున్న గుడితండాకు ఆర్‌ఆర్‌అండ్‌ ప్యాకేజీ కింద గుమ్మడవెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 86లో గల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే ఈ అంశాన్ని నిలిపివేయాలని కోరారు. గుడితండావాసులకు వేరే చోట పునరావాసం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రమావత్‌ రమేష్‌, రమావత్‌ రాజు, కోటియా, హనుమంతు, మల్లేష్‌, ధర్మ, భాను, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement