బీరన్నకు బోనాలు | - | Sakshi
Sakshi News home page

బీరన్నకు బోనాలు

Jul 3 2025 4:41 AM | Updated on Jul 3 2025 4:41 AM

బీరన్నకు బోనాలు

బీరన్నకు బోనాలు

ములుగు రూరల్‌: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదవ కులస్తులు బీరన్న స్వామికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం మహిళలు బోనాల ఆలయానికి బయలుదేరి వెళ్లి నైవేద్యం సమర్పించి యాటపోతులను బలిచ్చారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు గొర్రె అంకూస్‌, ఇమ్మడి భిక్షపతి, కొనుపుల కుమార్‌, బైకాని ప్రకాశ్‌, బొంతల వేణు, గోపు చంద్రమల్లు, బైకాని సారయ్య, ఇమ్మడి శ్రీనివాస్‌, ఇమ్మడి రమేష్‌, మహిళలు పాల్గొన్నారు.

ప్రతీ విద్యార్థి

మొక్కలు నాటాలి

భూపాలపల్లి అర్బన్‌: పర్యావరణ సమతుల్యతలను కాపాడేందుకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణంలో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు కొమల, సరోత్తంరెడ్డి, రామకృష్ణ, రాజయ్య, సురేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement