హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page
breaking news

హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి

హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఉదయాన్నే బస్సులు, కార్లు, ఆటోలు ఇతర వాహనాల్లో గుట్టపైకి చేరుకున్నారు. దీంతో దైత అమ్మవారు(వనదేవత), ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపంతో పాటు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు హేమాచలకొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు పూజారులు పవన్‌కుమార్‌, శేఖర్‌శర్మ స్వయంభు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement