
కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఏటూరునాగారం: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఏటూరునాగారం కరాటే అకాడమికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపినట్లు కోచ్ హుస్సేన్ తెలిపారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో జాతీయస్థాయి ఓపెన్ కరాటే పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీలకు ఏటూరునాగారం కరాటే అకాడమి నుంచి విద్యార్థులు హాజరై ప్రతిభ చాటారు. సబ్ జూనియర్స్ విభాగంలో కుంట వర్షిత్ 65 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా, వసంత, విశాల్, సాయి –40 కిలోల విభాగంలో బంగారు పతకాలు, కటా విభాగంలో బిల్ల దీక్షిత్సాయి, సలేంద్ర హర్షవర్ధన్, అనన్య, శ్రీపాద సిల్వర్ మెడల్స్ సాధించారని తెలిపారు. కమిటీ విభాగంలో సలేంద్ర సాయి వర్షిత్, బిళ్ల మోహన్ సాయి బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను జిల్లా కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్బు అభినందించారు.