
ఉద్యోగ విరమణ ఉద్యోగులకు సహజం
ములుగు: ఉద్యోగ విరమణ ప్రతీ ఉద్యోగికి సహజం అని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మారెడ్డి, పీసీఆర్ ఏఎస్సై రవీందర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఖాజామోయినుద్దీన్, ఏటూరునాగారం హెడ్ కానిస్టేబుల్ రామారావులు సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో నలుగురిని శాలువాలతో సన్మానించిన ఎస్పీ వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని తెలిపారు. ఇప్పటికై నా కుటుంబంతో ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నలువాల రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ వెంకట్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి కృషి
ములుగు: మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సాధు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన జనరల్బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాధ్యమైనంత వరకు నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతో పాటు సభ్యులకు సభ్యత్వాలు ఇప్పిస్తానని తెలిపారు. సహకార సంఘాలకు నూతన భవనాల మంజూరుకు పాటు పడుతానని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించేలా చూస్తానని తెలిపారు. వచ్చే సీజన్లో సాధ్యమైనంత వరకు జులై, ఆగస్టు మాసాల్లో చేపపిల్లలను వదిలేలా తన వంతుగా చర్యలు తీసుకుంటానని వివరించారు.
ఈదురు గాలులు.. భారీ వర్షం
ములుగు: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి తడిసిపోయింది. కొంత మంది రైతులు అందుబాటులో ఉండి టార్పాలిన్లు కప్పి ఉంచగా మిగతా రైతులు అచేతనంగా ఉండి పోయారు. తెల్లారితే గాని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, కోతకు సిద్ధంగా ఉన్న వరి పరిస్థితులు తెలిసే అవకాశం ఉంది.

ఉద్యోగ విరమణ ఉద్యోగులకు సహజం

ఉద్యోగ విరమణ ఉద్యోగులకు సహజం