ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

ప్లాస

ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం ప్లాస్టిక్‌ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌– గ్రామీణ్‌ కింద రూ. 61.28కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం వాటా 40శాతం ఉండనుంది. ఈ నిధులకు వివిధ టార్గెట్లను నిర్ణయించారు. ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో డీఆర్‌డీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. – సాక్షి, సిద్దిపేట

ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం

స్‌బీఎంలో మంజూరైన నిధులకు టార్గెట్‌కు అనుగుణంగా గ్రామాల వారీగా ప్రతిపాదనలు తెప్పిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంపికలు కాగానే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తాం. ఆగస్టులోగా పనులు పూర్తి అయ్యేలా ముందుకు సాగుతున్నాం. అలాగే కొత్తగా ఏర్పాటైన గ్రామాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాం.

– జయదేవ్‌ ఆర్యా, డీఆర్‌డీఓ, సిద్దిపేట

ల్లెల్లో తొలిసారిగా ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు 11 మంజూరు చేశారు. ఒక్కోదానికి రూ.64లక్షల చొప్పున రూ.7.04కోట్లను కేటాయించారు. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్‌, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్‌లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి వివిధ రకాల వస్తువులను తయారు చేయనున్నారు. ప్రాసెస్‌ చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌, రికవరీ ప్రక్రియల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్‌ వ్యర్థాలను దహనం చేయడం కానీ, ల్యాండ్‌ ఫిల్లింగ్‌ చేయడం చేయనున్నారు. కాలుష్యంను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

19వేల మరుగుదొడ్లు మంజూరు

ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.12వేల చొప్పున కేటాయించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు 19,806 వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.23.76 కోట్లను మంజూరు చేశారు. పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్‌ స్థలాలు, ఆస్పత్రులు, బస్టాండ్లు అవసరమైన చోట్ల 53 శానిటేషన్‌ కాంప్లెక్స్‌లను రూ.1.59కోట్లతో నిర్మించనున్నారు.

● కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు 53 కేటాయించారు. ఒక్కోదానికి రూ.3లక్షల నిధులు మంజూరు చేశారు. ఇందులో నిధులు ఎస్‌బీఎం నుంచి 70శాతం, 15వ ఆర్థిక సంఘం నిధులు 30శాతం మంజూరు చేయనున్నారు.

50 నూతన పంచాయతీల్లో..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలలో నూతనంగా 50 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. నూతనంగా మెదక్‌లో 24, సంగారెడ్డిలో 11, సిద్దిపేటలో 15 గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్రవిసర్జన రహిత గ్రామా లుగా తయారు చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు.

పల్లెల్లో రీసైక్లింగ్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,633 జీపీలకు రూ.61 కోట్లు

11 ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు మంజూరు

ఓడీఎఫ్‌ దిశగా నూతన పంచాయతీలు

జిల్లాల వారీగా చేపట్టే పనులు

యూనిట్‌లు మెదక్‌ సంగారెడ్డి సిద్దిపేట మొత్తం నిధులు

వ్యక్తిగత మరుగుదొడ్లు 1,200 15,606 3,000 రూ. 23.76కోట్లు

ఇంకుడు గుంతలు 5,744 7,390 5,931 రూ. 12.39కోట్లు

సామూహిక ఇంకుడు గుంతలు 898 1,091 876 రూ. 15.70కోట్లు

సిగ్రిగేషన్‌ షెడ్లు 24 11 15 రూ. 80లక్షలు

మేనేజ్‌మెంట్‌ ప్లాస్టిక్‌ వేస్ట్‌ 03 04 04 రూ. 7.04కోట్లు

పారిశుద్ధ్య సమూహాలు 15 19 19 రూ. 1.59కోట్లు

ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌1
1/1

ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement