కంది రైతుకు.. కరెంటు రంది | - | Sakshi
Sakshi News home page

కంది రైతుకు.. కరెంటు రంది

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

కంది రైతుకు.. కరెంటు రంది

కంది రైతుకు.. కరెంటు రంది

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని ఎనగండ్లలో బోర్ల కింద డ్రిప్‌ ఇరిగేషన్‌తో రైతులు ఆరుతడి పంట అయిన కంది సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్క పిలకదశకు వచ్చింది. ఈక్రమంలో విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నీరు సరిగా అందక పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరి సాగు కోసం తుకం పోసే పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై దుంపలకుంట సబ్‌స్టేషన్‌ సిబ్బందిని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ సరఫరాలో అంతరా యం లేకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement