
తెగని ఢీఎస్ఆర్!
ఇబ్బందులు పెట్టడం సరికాదు
ఫే్స రికగ్నైజేషన్తో హాజరు వేసే క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా 18 నెలలుగా పాలకవర్గాల లేక ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పు చేసి గ్రామాలను నెట్టుకొస్తున్నాం. ఈక్రమంలో కొత్త నిబంధన పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి. – నగేష్, పంచాయితీ
కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు
క్రమశిక్షణా చర్యలు తప్పవు
నేటి నుంచి డీఎస్ఆర్ యాప్ను వినియోగించి, దాని ద్వారానే పంచాయతీ కార్యదర్శులు హాజరువేయాలి. దీంతో పాటు రోజువారీ కార్యక్రమాలను యాప్లో పొందుపర్చాలి. యాప్ అందుబాటులోకి వచ్చి 15 రోజులు కావొస్తుంది. విస్మరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవు
– యాదయ్య, డీపీఓ
యాప్ను బహిష్కరించిన పంచాయతీ కార్యదర్శులు
● రెండు వారాలుగా అటెండెన్స్ వేయని తీరు
● నేటి నుంచి తప్పనిసరి అంటూ ఉన్నతాధికారుల అల్టిమేటం
● జిల్లాలో 469 మంది కార్యదర్శులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్ పంచాయతీ ఎటూ తెగడం లేదు. కొత్త మార్గదర్శకాలు మరింత ఇబ్బందికరంగా మారాయని పంచాయతీ కార్యదర్శులు రెండు వారాలుగా యాప్ను బహిష్కరించారు. ఈక్రమంలో సోమవారం నుంచి యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని ఉన్నతాధికారులు అల్టిమేటం జారీ చేశారు. మాట వినకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. – మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా 493 గ్రామ పంచాయతీలు ఉండగా, 469 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో గ్రామాల్లో మెరుగైన పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24వ తేదీన రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు కార్యదర్శులు ఫేస్ రికగ్నైజేషన్తో అటెండెన్స్ వేయాలని, పంచాయతీలో జరిగే శానిటేషన్, ఇతర పనులకు సంబంధించిన ప్రక్రియ ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పింది. రోజువారీగా ఇళ్ల నుంచి సేకరించే చెత్త ఎన్ని కిలోలన్న దానిపై వివరాలను చేర్చాలని నిర్ణయించారు. అందులో తడి, పొడి చెత్త ఎంత సేకరిస్తున్నారు.. దాని నుంచి వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారా..? గ్రామంలోని పల్లె పకృతి వనాల నిర్వహణ, డంప్యార్డులు, శ్మశానవాటికలు, మురికి కాలువలు.. ఇలా అన్నిరకాల కార్యక్రమాలను యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
ససేమిరా అంటున్న సెక్రటరీలు
ఏ ఉద్యోగులకు లేని విధంగా ప్రభుత్వం తమకు అనేక నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు లేక 18 నెలలు అవుతుందని, గ్రామాల్లో చిన్నా చితక పనులతో పాటు చెత్త సేకరణ కోసం ప్రతి రోజు ట్రాక్టర్ను ఇంటింటికీ పంపుతున్నామని, డీజిల్ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నామని.. కొత్తగా వచ్చిన డీఎస్ఆర్ యా ప్ మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెగని ఢీఎస్ఆర్!

తెగని ఢీఎస్ఆర్!