అండర్‌– 14 క్రికెట్‌ క్యాంపునకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌– 14 క్రికెట్‌ క్యాంపునకు ఎంపిక

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 7:47 AM

అండర్

అండర్‌– 14 క్రికెట్‌ క్యాంపునకు ఎంపిక

వెల్దుర్తి(తూప్రాన్‌): రాష్ట్ర అండర్‌–14 క్రికెట్‌ క్యాంపునకు వెల్దుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి శశ్రీత్‌ గౌడ్‌ ఎంపికయ్యాడని పాఠశాల హెచ్‌ఎం సాంబయ్య తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని మండలంలోని చెర్లపల్లిలో ఆదివారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. యంగ్‌ స్టార్‌ క్రికెట్‌ లీగ్‌ నేషనల్‌ టోర్నమెంట్‌లో భాగంగా హైదరాబాద్‌లో గత నెలలో నిర్వహించిన పోటీల్లో శశ్రీత్‌గౌడ్‌ ప్రతిభ చాటారన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.

నల్లపోచమ్మకు

ప్రత్యేక పూజలు

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తు లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌, ఆలయ ఇన్‌చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అలాగే మేడ్చల్‌ సెషన్‌ కోర్డు జడ్జి అర్జున్‌, ఎన్‌ఐఏ అధికారి విశాల్‌గౌతమ్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జికి ఆలయ అధికారులు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకట్‌రెడ్డి, ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు.

రేషన్‌ కోసం పడిగాపులు

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రంలో రేషన్‌ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడు ఈపీడీఎస్‌ మిషన్‌పై ఆరుసార్లు వేలిముద్రలు వేయా ల్సి వస్తుంది. దీంతో బియ్యం పంపిణీలో ఆలస్యం జరుగుతోంది.

అర్హులందరికీ

సంక్షేమ ఫలాలు

తూప్రాన్‌: బీసీలకు కాంగ్రెస్‌తోనే సముచిత న్యాయం లభిస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మగుడి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు బీసీలకు అన్యా యం జరుగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులందరికీ అందించడమే తమ ధ్యేయం అన్నారు. రాష్ట్రంలో గద్వాల్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు పెద్దఎత్తున పెద్దమ్మ తల్లి ఆలయాలు నిర్మాణాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

అండర్‌– 14 క్రికెట్‌  క్యాంపునకు ఎంపిక 
1
1/3

అండర్‌– 14 క్రికెట్‌ క్యాంపునకు ఎంపిక

అండర్‌– 14 క్రికెట్‌  క్యాంపునకు ఎంపిక 
2
2/3

అండర్‌– 14 క్రికెట్‌ క్యాంపునకు ఎంపిక

అండర్‌– 14 క్రికెట్‌  క్యాంపునకు ఎంపిక 
3
3/3

అండర్‌– 14 క్రికెట్‌ క్యాంపునకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement