
అడవిలో హైకోర్టు జీపీల పర్యటన
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ అడవుల్లో ఇద్దరు అడ్వకేట్ జనరల్లు, ఆరుగురు హైకో ర్టు ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ) శుక్రవారం పర్యటించారు. సఫారీ ద్వారా అడవుల్లో తిరిగి అటవీ అందాలు తిలకించారు. వన్యప్రాణులను చూసి మురిసిపోయారు. జన్నారం రేంజ్ పరిధిలోని గోండ్గూడ బేస్క్యాంపు, బైసన్కుంట, తాళ్లపేట్ రేంజ్ పరిధిలోని మల్యాల వాచ్టవర్ వద్దకు వెళ్లి సందర్శించారు. సఫారీ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని న్యాయవాదులు తెలిపారు. రేంజ్ అధికారి సుష్మారావు, డీఆర్వో మమత, బీట్ అధికారి లాలుబాయి అడవి అభివృద్ధి, తదితర అంశాలను తెలియజేశారు.