ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలి

Nov 16 2023 6:08 AM | Updated on Nov 16 2023 12:05 PM

మాట్లాడుతున్న ఏసీపీ సదయ్య - Sakshi

మాట్లాడుతున్న ఏసీపీ సదయ్య

తాండూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య అన్నారు. బుధవారం మండలంలోని మాదా రం పోలీస్‌స్టేషన్‌ నుంచి మండల కేంద్రం వర కు కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఎలాంటి చర్యలనైనా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. తాండూర్‌ సీఐ శ్రీనివాస రావు, ఎస్సైలు రాజశేఖర్‌, నరేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement