జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం

Jun 3 2025 5:41 AM | Updated on Jun 3 2025 5:41 AM

జెండా

జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం

దేవరకద్ర: మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగుర వేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. దేవరకద్ర పాత బస్టాండ్‌లో కాంగ్రెస్‌ జెండా కట్ట వద్ద కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే జెండాను తలకిందులుగా కట్టారు. విషయం గమనించని కాంగ్రెస్‌ నాయకులు జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత జరిగిన పొరబాటును తెలుసుకుని జెండాను తిరిగి కిందకు దించి సరి చేసి మళ్లీ ఎగురవేశారు.

ప్రతి ఎకరాకు

సాగునీరందిస్తాం

చిన్నచింతకుంట: ప్రతి ఎకరాకు సాగునీరు అందిచడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమని దేవరకద్ర, మక్తల్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండలం ఉంధ్యాల గ్రామ ఫేస్‌–1 పంపు హౌస్‌కు పూజలు నిర్వహించి ఒక పంపు ద్వారా 315 క్యూసెక్క్‌ల జూరాల ప్రాజెక్ట్‌ నీటిని కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులు, చెరువులు, చెక్కుడ్యాంలు, కుంటలను నీటితో నింపి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అప్పంపల్లి సింగిల్‌ విండో డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి, కురుమూర్తి స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం  
1
1/1

జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement