
జాగ్రత్తలు పాటించాలి
వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా అవగాహనతో జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగి పడడం వంటివి జరిగితే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. రైతులు వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన మోటార్ల వద్ద తడి చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. అతుకులు గల పాత వైర్లకు బదులుగా కొత్త వైర్లను ఏర్పాటు చేసుకోవాలి.
– జె.నరేశ్, ఎస్ఈ, మహబూబాబాద్
●