
రైల్వే పెన్షనర్లు డిజిటల్ సేవలకు అప్డేట్ కావాలి
కాజీపేట రూరల్ : రైల్వే పెన్షనర్లకు హ్యుమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఆర్ఎంఎస్)– ఈ పాస్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) డిజిటల్ సేవలు ప్రవేశపెట్టినట్లు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ నేషనల్ (ఏఐఆర్ఆర్ఎఫ్) ప్రెసిడెంట్ ఎస్.శ్రీధర్ అన్నారు. కాజీపేట జంక్షన్లోని రైల్వే కమ్యూనిటీహాల్లో మంగళవారం రైల్వే పెన్షనర్ల శ్రేయస్సు దృష్ట్యా డిజిటల్ లిట్రసీ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ అవగాహన నిర్వహించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ రస్నాదేవి మాట్లాడుతూ రైల్వే పెన్షనర్స్ హెచ్ఆర్ఎంఎస్ ఈ –పాస్ను అనుసంధానం చేసుకోవాలన్నారు. కాజీపేట రైల్వే ఆస్పత్రి ఏసీఎంఎస్ హరిబాబు.. హెచ్ఎంఐఎస్ వినియోగంలో ఉన్న లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఎఐఆర్ఆర్ఎ్ఫ్ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.ఎస్.బాబు రావు, పి.వెంకటేశ్వర్లు, డివిజన్ ట్రెజరర్ డి.రాజేశ్వర్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సంగమయ్య, సిహెచ్.కొమ్మాలు, జె.కె.మల్లయ్య, సుధాకర్, యాదగిరి, రజాలి, ఆర్.వెంకటేశ్వర్లు, రామారావు, బి.సమ్మయ్య, ఆగయ్య, డి.మల్లేశం, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, బెల్లంపల్లి, జమ్మికుంట, రామగుండం, కేసముద్రం,డోర్నకల్, ఖమ్మం, వరంగల్, కాజీపేట నుంచి 300 మంది రైల్వే రిటైర్డ్ పెన్షనర్లు పాల్గొన్నారు.
ఏఐఆర్ఆర్ఎఫ్ ప్రెసిడెంట్ శ్రీధర్