జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం | - | Sakshi
Sakshi News home page

జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం

Jul 8 2025 5:20 AM | Updated on Jul 8 2025 5:20 AM

జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం

జలయజ్ఞంతో మారిన సాగు ముఖచిత్రం

● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఏర్పాటుతోకృష్ణాజలాలను పారించి సస్యశామలం చేశారు.

● కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపుగా 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టారు.

● దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్‌ మండలంలోని 50 గ్రామాలకు, డోన్‌పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55కోట్లతో తాగునీటిని అందించారు.

● హంద్రీనీవాలో భాగంగా వెల్దుర్తి మండలం మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మించి ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీటిని అందించారు.

● పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీతో 60వేల ఎకరాలకు సాగునీరు పారించారు.

● లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్‌ కాలువలు ఏర్పాటు చేసి వీటి ద్వారా మరో 5,100 ఎకరాలను సస్యశ్యామలం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement