తుగ్గలి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం రాంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..రాంపల్లికి చెందిన బాయిగడ్డ సుంకయ్య కుమారుడు రమేష్ (20) బైక్పై పెండేకల్లు రైల్వే జంక్షన్కు వెళుతుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న అదే గ్రామానికి చెందిన నాగరాజు బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు కూడా గాయపడడంతో చికిత్స నిమిత్తం డోన్కు తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇరు వర్గాలపై కేసు నమోదు
బొమ్మలసత్రం: స్థానిక ఫరూక్నగర్లోని పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన సంఘటనతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీంద్రనాఽథ్రెడ్డి మాట్లాడుతూ ఫరూక్నగర్లోని పోలింగ్ బూత్వద్ద టీడీపీ నేతలు ఎమ్యెల్యే అభ్యర్థి ఫరూక్, ఆయన తనయుడు ఫిరోజ్, న్యాయవాది తులసిరెడ్డితో పాటు మరి కొంత మంది, వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, ఆదిరెడ్డి, న్యాయవాది ఫణీంద్రనాధ్శర్మతో పాటు మరికొంత మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుని స్వల్ప ఘర్షణకు దారి తీసింది. పోలీసులు ఇరుపక్షాలకు నచ్చజెప్పి పంపారు. ఈ సంఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.