ఖరీఫ్‌ సాగు పనులు షురూ | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగు పనులు షురూ

Jun 8 2025 12:42 AM | Updated on Jun 8 2025 12:42 AM

ఖరీఫ్

ఖరీఫ్‌ సాగు పనులు షురూ

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో తమ తమ పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురిసాయి. రైతులు కూడా విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది 3.44 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయడానికి రంగం సిద్ధమైంది. 84 వేల హెక్టార్లు నీటిపారుదల భూములు కాగా మిగిలిన భూముల్లో ఏకదళ, ద్విదళ ధాన్య, వాణిజ్య పంటలు పండించడానికి అవకాశం ఉంది. జిల్లాలో 1.71 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, కేఎస్‌ఎంఎఫ్‌లో 7,393 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ దుకాణాల్లో 738.10 మెట్రిక్‌ టన్నుల అవసరం ఉంది. 90 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల కొరత ఉంది. ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ దేవిక వెల్లడించారు. జిల్లాలోని 35 రైతు కేంద్రాల్లో రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు నిల్వ ఉన్నాయని తెలిపారు. రైతులు దీనిని సద్వినియోగపరుచుకోవాలని కేంద్రం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి పేర్కొన్నారు.

విత్తనాలు, ఎరువుల కొరత లేదు

వ్యవసాయ శాఖ జేడీ దేవిక వెల్లడి

ఖరీఫ్‌ సాగు పనులు షురూ 1
1/1

ఖరీఫ్‌ సాగు పనులు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement