
కొళాయిల్లో ఒండునీరు.. జనం బేజారు
రాయచూరు రూరల్: నగరంలోని పలు కాలనీలకు నగరసభ అధికారులు, జలమండలి సిబ్బంది కొళాయిల ద్వారా ఒండునీటిని సరఫరా చేశారు. శనివారం మంగళవారపేటె, జహీరాబాద్, జీడితోట, నవాబ్గడ్డ, వాసవినగర్ ప్రాంతాల్లో కృష్ణా నది నుంచి సేకరించిన నీటిని శుద్ధీకరించకుండా సరఫరా చేశారు. కొళాయిల్లో ఒండునీరు, వాన నీరు కలిసి రాగా నురుగతో కూడిన నీరు సరఫరా అయ్యాయి. బేజారు పడిన ప్రజలు గత్యంతరం లేక ఆ నీటినే పట్టుకున్నారు. రాంపూర్ జలాశయం నుంచి నీరు వదలడంతో కొళాయిల్లో ఒండు నీరు రావడం కనిపించింది. ప్రజలు నగరసభ, జలమండలి అధికారుల పనితీరు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై రగిలిపోయారు.

కొళాయిల్లో ఒండునీరు.. జనం బేజారు