వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు

Jun 6 2025 1:13 AM | Updated on Jun 6 2025 1:13 AM

వేడుక

వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు

బళ్లారి అర్బన్‌: నగరంలో పార్శ్వనాథ్‌ జైన్‌ శ్వేతాంబర్‌ మందిర్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ ఉత్సవ కమిటీ పార్శ్వనాథ్‌ పరమాత్మ శోభయాత్రను నిర్వహించారు. ఈ ఊరేగింపులో డోలు, తాషారండోల్‌ వంటి వివిధ కళా బృందాలతో తేరు వీధిలోని శ్వేతాంబర్‌ జైన్‌ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు తేరు వీధి, మోతీ సర్కిల్‌, కాళమ్మ వీధి సర్కిల్‌, బెంగళూరు రోడ్డు, బ్రూస్‌పేట్‌ సర్కిల్‌ మీదుగా మళ్లీ ఆలయానికి చేరుకుంది. విమలాసాగర్‌ సూరేశ్వర్‌ జీ మహారాజ్‌ ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం ఆలయంలో ప్రవచనం, భక్తులకు ఆశీస్సులు అందించారు. భక్తులకు మహామంగళ హారతి, ప్రసాదం పంపిణీ నిర్వహించారు. సాయంత్రం పాలక సేవా మతపరమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపులో పార్శ్వనాథ్‌ జైన్‌ శ్వేతాంబర్‌ సంఘం అధ్యక్షులు ఉత్సవ్‌లాల్‌ బాగ్రేచా, ఉపాధ్యక్షులు సూరజ్‌మల్‌ దంతెవాడి, ప్రధాన కార్యదర్శి రోషన్‌ జైన్‌, సహ కార్యదర్శి అనిల్‌ బాగ్రేచా, జాయింట్‌ కార్యదర్శి భరత్‌, ట్రెజరీ గౌతమ్‌ బుజ్వాన్‌, వినోద్‌ బాగ్రేచా, మహావీర్‌, హర్ష జైన్‌, అజయ్‌ సోని, దేవస్థాన పదాధికారులు, జైన్‌ ప్రముఖులు, సమాజ బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

ఆకట్టుకున్న శోభాయాత్ర ఊరేగింపు

వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు 1
1/2

వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు

వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు 2
2/2

వేడుకగా జైన్‌ ఆలయ శతాబ్ది ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement