మొక్కల పెంపకంతో పర్యావరణ రక్షణ | - | Sakshi
Sakshi News home page

మొక్కల పెంపకంతో పర్యావరణ రక్షణ

Jun 6 2025 1:13 AM | Updated on Jun 6 2025 1:13 AM

మొక్కల పెంపకంతో పర్యావరణ రక్షణ

మొక్కల పెంపకంతో పర్యావరణ రక్షణ

హొసపేటె: పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ మనోహర్‌ లాల్‌ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటి నీరు పోసిన అనంతరం ఆయన మాట్లాడారు. జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుందన్నారు. అందుకే స్వచ్ఛ భారత్‌లో భాగంగా చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నామన్నారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా సీనియర్‌ ఉపాధ్యాయులు ప్రకాష్‌, ఉపాధ్యాయురాలు సునీత, రమీజా, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement