ఒక్క అంబులెన్స్‌ లేదు, వైద్యం లేదు | - | Sakshi
Sakshi News home page

ఒక్క అంబులెన్స్‌ లేదు, వైద్యం లేదు

Jun 6 2025 1:11 AM | Updated on Jun 6 2025 1:52 PM

ఒక్క

ఒక్క అంబులెన్స్‌ లేదు, వైద్యం లేదు

యశవంతపుర: రాజకీయ సమావేశాలకు కల్పించే ప్రాధాన్యం, బెంగళూరులో ఆర్‌సీబీ విజయోత్సవానికి ఎందుకు కల్పించలేదని తొక్కిసలాటలో చనిపోయిన బాలిక దివ్యాంశి తండ్రి శివకుమార్‌ ప్రశ్నించారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ఇంత గొప్ప సంభ్రమానికి ఎందుకు సరైన సౌకర్యాలను కల్పించలేదని కన్నీటితో ప్రశ్నించారు. 

అమ్మ, పిన్నమ్మ జతలో చిన్నస్వామి స్టేడియం గేటు నంబర్‌ 15లో చేరుకున్న దివ్యాంశి (14) తొక్కిసలాటలో చిక్కుకుంది. జనం బాలికను బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు చికిత్సలు చేయడానికి ముందుకు రాలేదని తండ్రి విలపించారు. నా భార్యకు సీపీఆర్‌ చేశారు, ఒక్క అంబులెన్స్‌ లేదు. పోలీసులు సాయం చేయలేదు. 

నాలుగు గంటల పాటు స్టేషన్‌లో కూర్చున్నా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు అని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంత పరిస్థితిలో ఎవరు కాచుకుని కూర్చుంటారు? సరైన వ్యవస్థలు లేని కారణంగా ఈ ఘోరం జరిగిందని శివకుమార్‌ ఆరోపించారు. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఒక్క అంబులెన్స్‌ లేదు, వైద్యం లేదు 1
1/1

ఒక్క అంబులెన్స్‌ లేదు, వైద్యం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement