ఎన్‌ఐఏచే దర్యాప్తు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏచే దర్యాప్తు చేయాలి

May 5 2025 8:46 AM | Updated on May 5 2025 8:46 AM

ఎన్‌ఐ

ఎన్‌ఐఏచే దర్యాప్తు చేయాలి

బనశంకరి: మంగళూరు నగరంలో హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ కి అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్‌ చేయడం తెలిసిందే. హంతకులకు మరణశిక్ష విధించాలని తల్లి సులోచనశెట్టి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, ఎన్‌ఐఏ తో విచారణ చేయించాలన్నారు. తమ కుమారున్ని పోలీసులు ఇబ్బందిపెట్టారని, హత్యకు బజ్పే పోలీసులు కారణమని ఆమె ఆరోపించారు. నిత్యం సుహాస్‌శెట్టి వాహనం తనిఖీలు చేసేవారు, చెప్పినట్లు వినకపోతే కాళ్లపై కాలుస్తామని బెదిరించారని ఆరోపించారు. సుహాస్‌శెట్టి తండ్రి మోహన్‌శెట్టి మాట్లాడుతూ కొందరు తన కుమారుడిని రౌడీషీటర్‌ గా చెబుతున్నారన్నారు. తన భార్యకు క్యాన్సర్‌ చికిత్సకు ఇబ్బంది పడుతున్నామని, ఇసుక వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉండే కుమారున్ని పోగొట్టుకున్నామని విలపించారు. త్వరగా కొత్త ఇళ్లు కట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని, కానీ హత్య చేశారని చెప్పారు.

సద్దుమణిగిన ఉద్రిక్తత

హత్యతో శుక్రవారం బంద్‌ అయిన మంగళూరు సాధారణ స్థితికి వచ్చింది. పరిస్థితులు కాస్త సద్దుమణిగి సహజస్థితిలోకి చేరుకున్నాయి. 2023 లో చోటుచేసుకున్న వరుస హత్యలతో మంగళూరు పర్యాటక రంగానికి ఆటంకాలు వచ్చాయి. తాజా హత్యతో మళ్లీ భయం ఏర్పడింది. బీచ్‌లలో పర్యాటకుల రద్దీ మొదలైంది.

సుహాస్‌శెట్టి తల్లిదండ్రుల డిమాండ్‌

మామూలు స్థితికి మంగళూరు సిటీ

ఎన్‌ఐఏచే దర్యాప్తు చేయాలి1
1/1

ఎన్‌ఐఏచే దర్యాప్తు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement