బయల్పడిన పురాతన శిలాశాసనం | - | Sakshi
Sakshi News home page

బయల్పడిన పురాతన శిలాశాసనం

May 1 2025 12:14 AM | Updated on May 1 2025 12:14 AM

బయల్ప

బయల్పడిన పురాతన శిలాశాసనం

బళ్లారి రూరల్‌: దావణగెరె జిల్లా న్యామతి తాలూకా మాదాపురం చెరువులో బాదామి చాళుక్యల కాలం నాటి శిలాశాసనాలు లభ్యమైనట్లు కమలాపురం పురావస్తు శాఖ సంగ్రహాలయం, పారంపర్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌.శేజేశ్వర ఓ ప్రకటన ద్వారా తెలిపారు. మాదాపురంలోని చెరువులో స్థానికులు జేసీబీతో మట్టిని తవ్వుతుండగా శిలాశాసనాలు బయట పడ్డాయి. దీంతో పురావస్తు శాఖ సంగ్రహాలయం పారంపర్య శాఖ సంచాలకుడు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఈ శిలాశాసనాలు క్రీస్తు పూర్వం 7వ శాతాబ్దం నాటి బాదామి చాళుక్య మొదటి విక్రమాదిత్య పాలన సాగించిన 654–681 కాలం నాటి శాసనాలుగా గుర్తించారు. ఈ శిలాశాసనం 5 అడుగుల ఎత్తుతో 17 వరుసల్లో పురాతన కన్నడ భాషలో ఉన్నట్లు తెలిపారు. ఆ కాలంలో ప్రజలు కట్టాల్సిన పన్ను రద్దు్‌, చెరువు నిర్మాణానికి భూమికి సంబంధించిన వివరాలు శాసనంలో ఉన్నట్లు తెలిపారు. శానసంలో 70 గ్రామాల పరిపాలన విభాగాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఈ శాననం 1344 ఏళ్ల నాటి పురాతనమైనదిగా ఆయన గుర్తించారు. ఈ శాసనాన్ని ప్రొఫెసర్‌ శ్రీనివాస పాడిగర, రమేశ్‌ హిరేజంబూరు చదవగలిగారు. ఈ పరిశీలనలో క్షేత్ర కార్యదర్శి డాక్టర్‌ రవికుమార్‌ నవలగుంద సహకారం ఉన్నట్లు తెలిపారు. మాదాపుర గ్రామ మంజప్ప చుర్చిగుండి, పరిపాలనాధికారి విశ్వనాథ, గ్రామస్తులు భుజంగలకు పురావస్తు శాఖ అధికారి కృతజ్ఞతలు తెలిపారు.

మొదటి విక్రమాదిత్య కాలం నాటి శిలాశాసనంగా గుర్తింపు

క్రీస్తుపూర్వం 7వ శతాబ్దపు శాసనంగా పురావస్తు శాఖ వెల్లడి

బయల్పడిన పురాతన శిలాశాసనం 1
1/2

బయల్పడిన పురాతన శిలాశాసనం

బయల్పడిన పురాతన శిలాశాసనం 2
2/2

బయల్పడిన పురాతన శిలాశాసనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement