
ఉచితంగా మజ్జిగ పంపిణీ
బళ్లారి రూరల్ : భగభగ మండుతున్న ఎండలకు గొంతులో కాసిన్ని మంచినీళ్లు పడితే ప్రాణం కాస్త కుదుట పడుతుంది. మరి చల్లని మజ్జిగ తాగితే మరింత ఉపశమనం కలుగుతుందని భావించిన దావణగెరె స్పూర్తి సేవా ట్రస్టు దావణగెరె మహానగర పాలికె ముందు నగరవాసులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత 30 ఏళ్లుగా నగరంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ట్రస్టు ప్రముఖుడు బి.సత్యనారాయణ మూర్తి తెలిపారు. ట్రస్టు ప్రముఖులు బెన్నళ్లి శివకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
26 నుంచి గాలికుంటు నివారణకు టీకాలు
హొసపేటె: పశువుల్లో కనిపించే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి జూన్ 9 వరకు మొత్తం 45 రోజుల పాటు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పోమ్ సింగ్ తెలిపారు. పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, అన్ని స్థానిక సంస్థల్లో 7వ రౌండ్ కాళ్లు, నోటి వ్యాధికి టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాదం, నోటి వ్యాధి అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది గిట్టలు గల అన్ని జంతువులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పశువులు, గేదెల పాదాలు, నోటిపై పుండ్లు ఏర్పడటం ద్వారా రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల అపారమైన బాధ, అలసట, తక్కువ పాల దిగుబడి వస్తుంది. ఈ విధంగా జిల్లాలోని 92 విభాగ సంస్థల్లో ఒకేసారి ప్రారంభిస్తారన్నారు, 45 మంది పశువైద్య అధికారులు, 10 మంది కాంట్రాక్ట్ ఆధారిత పశువైద్య అధికారులు సహా 238 మంది వ్యాక్సినేటర్లు, 81 మంది అవుట్ సోర్సింగ్, అనుబంధ కార్మికులు సహా 157 మంది విభాగ సిబ్బంది టీకా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పశువుల పెంపకందారులు, ప్రజలు ఈ టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
భక్తిభావం పెంచుకోవాలి
రాయచూరు రూరల్: మానవుడు తన జీవితంలో భక్తిభావం పెంపొందించుకునేందుకు కృషి చేయాలని బాళెహొన్నూరు రంభాపురి పీఠాధిపతి పిలుపు ఇచ్చారు. బుధవారం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకాలోని హుడిగిలో దిగంబర కరి బసవేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా విరుపాక్షలింగ శివాచార్య పట్టాధికార ఉత్సవాల్లో భక్తులకు ఆశీర్వచనాలు అందించి మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మధనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో పట్టాధికారం చేయించారు. శాంతమల్ల శివాచార్య, విధాన పరిషత్ సభ్యుడు చంద్రశేఖర్ పాటిల్, స్వామీజీలు, మాజీ శాసన సభ్యులున్నారు.
ఎయిమ్స్ మంజూరు
చేయించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయ జనాక్రోశ యాత్రకు బదులు ఎయిమ్స్ మంజూరు చేయించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. బుధవారం బెంగళూరు విధానసౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాక్రోశ యాత్ర చేపట్టడంపై ఉన్న శ్రద్ధ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయించడంపై లేదని ఆక్రోశించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందన్నారు.
లింగాయత్ మంత్రులు
రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి కుట్ర పన్నారని, కులగణనను వ్యతిరేకిస్తూ కేబినెట్లోని ఏడుగురు లింగాయత్ మంత్రులు రాజీనామా చేయాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సోమవారపేట హిరేమఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాలపై నివేదించిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించిన అంశంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఉచితంగా మజ్జిగ పంపిణీ

ఉచితంగా మజ్జిగ పంపిణీ