
అందరి కృషితో బళ్లారికే కేంద్ర కార్యాలయం
బళ్లారిఅర్బన్: ఎన్నో ఏళ్లుగా కర్ణాటక గ్రామీణ బ్యాంక్(కేజీబీ) కేంద్ర కార్యాలయం బళ్లారిలో ఉన్నా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధార్వాడ, బెంగళూరు ప్రాంతాలకు కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు రావడంతో బళ్లారిలోని వివిధ కన్నడ పర సంఘాల నాయకుల పోరాటం, ప్రజాప్రతినిధుల కృషితో కేజీబీ ప్రధాన కార్యాలయం తిరిగి బళ్లారికే దక్కిందని సహమత సంఘాల ఐక్యత అధ్యక్షుడు పన్నారాజ్ తెలిపారు. మంగళవారం రామప్ప సభాభవనంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం పదాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేజీబీ ప్రధాన కార్యాలయం బళ్లారికి తిరిగి రావడంతో సహకరించిన సంఘాల నేతలను గుర్తించి స్వీట్లను పంచి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కసాప అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, కన్నడ పర సంఘాల నేతలు టీ.శేఖర్, గడ్డం తిమ్మప్ప, మంజునాథ్, శ్రీనివాస్, పుష్ప, పద్మ తదితరులు పాల్గొన్నారు.