
ఆనందోత్సాహాలతో ఈస్టర్
శివాజీనగర: లోక కళ్యాణార్థమై సిలువలో బలియాగం చేసిన గుడ్ఫ్రైడే తరువాత మూడో రోజు మరణాన్ని జయించిన యేసు ప్రభు పునరుత్థానమైన ఈస్టర్ పండుగను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బెంగళూరులో అన్ని చర్చిల్లో ఈస్టర్ వేడకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. గుడ్ఫ్రైడే, ఈస్టర్ను పురస్కరించుకొని 45 రోజుల పాటు శ్రమదినాలుగా భావించి ఉపవాస ప్రార్థనల్లో నిమగ్నమైన క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకోవటం ద్వారా ఉపవాస ప్రార్థనలను విరమించారు. చర్చిలలో ప్రార్థనలు జరిపి, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మిస్పా తెలుగు చర్చీ పాస్టర్ రెవరెండ్ డీ. ఆండీ బెరాకా పండుగ సందేశాన్ని వివరించారు. మరియమ్మనహళ్లి కర్ణాటక కల్వరి చర్చీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. బళ్లారి ఎల్–షడాయ్ మినిస్ట్రీస్ పాస్టర్ ద్వారకనాథ్ రావు యాదవ్ ఈస్టర్ పండుగ విశిష్టతను తెలియజేశారు. పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య, సంఘ సభ్యులు ప్రార్థనలు చేశారు.
చర్చిలలో విశేష ప్రార్థనలు