రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి

Jun 6 2025 1:11 AM | Updated on Jun 6 2025 1:11 AM

రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి

రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్రస్ధాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్‌రావు ఉత్తమ పంచాయతీ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. రాష్ట్రస్ధాయిలో ఈ అవార్డు కోసం మూడు గ్రామపంచాయతీలు ఎంపిక చేయగా చామనపల్లి పంచాయతీకి మొదటి స్థానం లభించింది. సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌, స్వచ్ఛత, పర్యావరణం, పచ్చదనం. సెగ్రేషన్‌షెడ్‌, కంపోస్టు ఎరువుల తయారీ, విటమిన్‌ గార్డెన్‌, ప్లాంటేషన్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ తదితర అంశాల్లో చామనపల్లి పంచాయతీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మొదటిస్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో సీహెచ్‌.జగన్మోహన్‌రెడ్డి, కార్యదర్శి మహేందర్‌రావు, పంచాయతీ సిబ్బందిని మంత్రి సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌ నదీమ్‌, టీఎస్‌ పీసీబీ మెంబర్‌ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement