
ముస్తాబాద్లో కుళ్లిన మాంసం విక్రయం
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్లో కుళ్లిన మాంసం విక్రయాలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ముస్తాబాద్లోని మటన్ మార్కెట్ వద్ద బుర్ర శ్రీనివాస్ ఆదివారం మాంసం కొనుగోలుకు వెళ్లాడు. శ్రీనివాస్కు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న మాంసం విక్రయించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఫ్రిజ్ల్లో పెట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. తలకాయ కొనుగోలు చేసిన తనకు దుర్వాసన వస్తున్న మాంసాన్ని విక్రయించారన్నారు. ముస్తాబాద్లో మాంసం విక్రయాలపై అధికారుల నిఘా లేకుండా పోయిందన్నారు. పశుసంవర్థకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే మాంసం విక్రయాలు చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కుళ్లిపోయిన మాంసాన్ని ప్రజలకు అంటగడుతున్నారన్నారు. దీనిపై జిల్లా అఽధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.