
కవిత పార్టీ పెట్టడం ఊహాగానాలే
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ● పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కరీంనగర్కల్చరల్: బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ పెట్టడం ఊహాజనితమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొట్టిపారేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరెపల్లిలో ఆదివారం శ్మశానవాటికలో అభివృద్ధి పనులు, కల్వర్టు నిర్మాణానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ తుల రాజేశ్వరి– బాలయ్యతో కలిసి భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజా స్వామ్యబద్ధమైన పార్టీఅని, ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని అ న్నారు. కవిత బహిరంగ లేక రాయడం కాకుండా కేసీఆర్కు వ్యక్తిగతంగా విషయాలు చెప్పి ఉంటే బాగుండేదని, కేటీఆర్ వ్యాఖ్యలకు తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కవిత కొత్తపార్టీ పెట్టడం అనేది ఊహాగానాలే అని కొట్టిపడేశారు. కేసీఆర్ తమకు నాయకుడని, ఆయన బాటలో ప్రతి కార్యకర్త నడుచుకుంటారన్నారు. ఎన్నారైల ఆధ్వర్యంలో జూన్ 2న అమెరికాలో తెలంగాణ ఆవి ర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు తాను హాజరుకానున్నట్లు తెలిపారు. ఆరెపల్లి డివిజన్వాసులు శ్మశానవాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శ్మశాన వాటిక నిర్మాణానికి 15వ ఫైనాన్స్ నిధుల నుంచి సుమారు రూ. 49.50 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఆరెపల్లి నుంచి రాణిపూర్ నగునూరు దుర్గామాత ఆలయానికి వెళ్లేదారిలో రూ. 12లక్షలు వెచ్చించి కల్వర్టు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. నాయకులు జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేశ్, పిల్లి మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.