
పదిలో ఆరో స్థానం
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
కరీంనగర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానం దక్కించుకుంది. గత ఏడాది 96.65 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానం సాధించగా, ఈసారి ఉత్తీర్ణత 97.90 శాతం నమోదయింది. జిల్లాలో మొత్తం 12,508 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,245 మంది పాసయ్యారు. 263 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఎప్పటిలాగే ఈ విద్యా సంవత్సరం సైతం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు గణనీయమైన ఉత్తీర్ణత సాధించాయి.
సత్తాచాటిన మోడల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్
జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, కేజీబీవీ, ఎయిడెడ్, మోడల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఫలితాల్లో సత్తాచాటారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో 8 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 25 జ్యోతిబాపూలే గురుకులాల్లో 1,614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 1,607 మంది ఉత్తీర్ణత సాధించారని జ్యోతిబాపూలే ఉమ్మడి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ అంజలి వెల్లడించారు. జిల్లా పరిధిలోని మానకొండూరు, నగునూర్, కరీంనగర్, రామడుగు, హుజూరాబాద్ బాలుర వసతి గృహాల్లో మొత్తం 36 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 35 మంది ఉత్తీర్ణత సాధించారు. బీసీ బాలికల వసతి గృహం కరీంనగర్లో ఒకరి విద్యార్థిని ఉత్తీర్ణత సాధించింది. ఎస్సీ వసతి గృహాల్లో 156 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 149 మంది ఉత్తీర్ణత సాధించారు.
11 మోడల్ స్కూల్లో 98 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని 11 మోడల్ స్కూళ్లల్లో 965 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 947 మంది ఉత్తీర్ణత సాధించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో గంగాధర, ఎలగందల్, రామడుగు, సైదాపూర్, శంకరపట్నం, తిమ్మాపూర్ పాఠశాలల ఉన్నాయి.
జూన్ 3 నుంచి సప్లమెంటరీ..
ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 17లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని, జూన్ 3 నుంచి 13 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో జనార్దన్రావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్న ం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు రీవెరిఫికేషన్ దరఖాస్తు ఫారం కోసం డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున డీడీ (ఎస్బీఐ/ఎస్బీహెచ్) తీసి ఈనెల 15 వరకు డీఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లాలో 97.90 శాతం ఉత్తీర్ణత 12,508 మంది విద్యార్థులకు 12,245 మంది ఉత్తీర్ణత సత్తాచాటిన మోడల్ స్కూల్, ఎస్సీ, బీసీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు
అంశం బాలురు బాలికలు మొత్తం
హాజరైనవారు 6,616 5,892 12,508
ఉత్తీర్ణులు 6,451 5,794 12,245
ఉత్తీర్ణత శాతం 97.51 98.34 97.90
న్యూస్రీల్
పదోతరగతిలో నాలుగేళ్ల ఫలితాలు
సంవత్సరం ఉత్తీర్ణతశాతం రాష్ట్రంలో స్థానం
2022 93.34 15వ స్థానం
2023 95.00 4వ స్థానం
2024 96.65 7వ స్థానం
2025 97.90 6వ స్థానం

పదిలో ఆరో స్థానం