
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్గట్ల మాజీ సర్పంచ్ పిట్ల మీన (48) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఏర్గట్లకు చెందిన మీనా తన సోదరుడితో కలిసి బైక్పై మోర్తాడ్ నుంచి ఏర్గట్లకు బయలుదేరింది. తిమ్మాపూర్ శివారులో వీరి బైక్కు కుక్క అడ్డు రావడంతో, దానిని తప్పించబోయేక్రమంలో బైక్ అదుపుతప్పి మీనా, ఆమె సోదరుడు కిందపడిపోయారు. ఈఘటనలో మీనా తలకు తీవ్ర గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై విక్రమ్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏర్గట్లలో విషాదఛాయలు...
తమ గ్రామానికి సర్పంచ్గా పని చేసిన మీనా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఏర్గట్లవాసులు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఆమె మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం గ్రామంలో మీనా మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.