లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రంలోని ఫైనాన్స్ నిర్వాహకుల ఇళ్లలో సోదాలు చేసినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ తెలిపారు. మండల కేంద్రంలో గతేడాది ముగ్గురు ఫైనాన్షియర్ల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేసినట్లు సీఐ గుర్తు చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాలతో బుధవారం దాడులు చేశామన్నారు. గతంలో కేసులు నమోదైన పారిపల్లి సంతోష్, కౌడ రవి, జక్కని బాబాలతోపాటు కొత్త సంతోష్ దుకాణంలో సోదాలు నిర్వహించామన్నారు. పాత వారి వద్ద ఎలాంటి పత్రాలు, మనీ లెండింగ్ చేస్తున్నట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. కొత్త సంతోష్ వద్ద నాలుగు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఎక్కువ వడ్డీకి ఇచ్చినట్లు రాసుకున్న పత్రాలు, రిజిస్టర్లు, రూ. 90 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొత్త సంతోష్పై తెలంగాణ మనీ లెండర్స్ యాక్టు 1349 కింద కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు సీజ్ చేసి కలెక్టర్కు పంపుతామని పేర్కొన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ఎస్సై ప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇళ్లలో ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని శేఖరప్ప, జాడె సూర్యప్రకాశ్, పంతంగి శ్రీనివాస్, మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన లునావత్ లాలు ఇంట్లో తనిఖీ చేసి ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వా
ధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
అనుమతిలేని ఫైనాన్స్ నిర్వాహకుల
ఇళ్లపై దాడి
భిక్కనూరు: మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఫైనాన్స్లు, చీటీలు నడిపే వారి ఇళ్లపై సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లతోపాటు వ్యాపార సముదాయాలపై దాడులు చేసి ప్రామిసరీ నోట్లు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు