దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం

Jul 2 2025 5:45 AM | Updated on Jul 2 2025 7:22 AM

దేవస్థానం పునర్నిర్మాణానికి  రూ.లక్ష విరాళం

దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం

అమలాపురం టౌన్‌: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్‌ చైర్మన్‌ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్‌, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement