
దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
అమలాపురం టౌన్: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్ చైర్మన్ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.