
వలంటీరుతోనే విద్యా దీవెన
వలంటీరు ఇంటి ముంగిటకే వచ్చి దరఖాస్తు పూర్తి చేసి తీసుకుని అవగాహన కల్పించడంతోనే మాకు విద్యాదీవెన వచ్చింది. అందువల్లనే మా పిల్లలు ఈ రోజు బాగా చదువుకోగలుగుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యా దీవెన పథకం తీసుకురావడమే కాకుండా ఆ పథకాన్ని వలంటీరు ద్వారా ఇంటికి పంపించి మరీ మంజూరు చేయించారు. మొదట్లో వలంటీర్లను చూసి వీళ్లేం చేస్తారనుకునే వాళ్లం. కానీ, వారు చేసిన సేవలు మాటలు కాదు. వారి మేలును జీవితంలో ఎప్పటికీ మరచిపోలేం. ఇల్లు లేని వారికి జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయించడంలో వలంటీర్లు చాలానే చేశారు.
– ఆలమూరు దుర్గ, నవరత్నాల లబ్ధిదారు,
పవర, సామర్లకోట మండలం
ప్రాణాలు లెక్క చేయకుండా..
కరోనా మహమ్మారితో బాధ పడుతున్న వారికి మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవలందించాం. అప్పట్లో మా కుటుంబాల్లోని వారి కంటే మాకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఉన్న వారి ప్రాణాలే ముఖ్యమనుకుని పని చేశాం. కోవిడ్ బాధితుల వద్దకు వెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులే ప్రాణాలు అరచేత పట్టుకుని భయపడిపోయే వారు. అటువంటిది కోవిడ్తో బాధ పడుతున్న వారు హోం ఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్నా లెక్క చేయకుండా వలంటీర్లుగా మేము ఎంతో చేశాం. అటువంటి మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డున పడేశారు. వేతనం రూ.10 వేలు చేస్తామని చెబితే నిజమే అనుకున్నాం. తీరా మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం అన్యాయం.
– కడియాల కిరణ్, వలంటీర్, వాకలపూడి