చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి

Jun 1 2025 1:02 AM | Updated on Jun 1 2025 1:02 AM

చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి

చెరుకు బిల్లులు సకాలంలో చెల్లించాలి

అమరచింత: చెరుకు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో పలువురు రైతులు శనివారం కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీ ఈడీ రవికుమార్‌, డీజీఎం నాగార్జునరావుకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, లేదంటే 16 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉందని, వాటిని నేటికీ అమలు చేయడం లేదని తెలిపారు. విత్తన బిల్లులు 40 రోజుల్లో ఇస్తామన్న యాజమాన్యం ఇప్పటి వరకు చెల్లించలేదని వివరించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని.. రాయితీలు సకాలంలో చెల్లించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్‌లో రికవరీతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించాలని, వేరు పురుగు సోకిన పంట రైతులకు యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నేటి వరకు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. త్వరగా చెల్లించి రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

4న ఇంటర్వ్యూలు

నాగర్‌కర్నూల్‌ క్రైం: నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను బస్తీ దవాఖానాల్లో ఒప్పంద పద్ధతిన వైద్యాధికారుల నియామకానికి ఈ నెల 4న వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సా యంత్రం 5 వరకు దరఖాస్తుతో పాటు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement