ప్రతి రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య | - | Sakshi
Sakshi News home page

ప్రతి రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

ప్రతి రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య

ప్రతి రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య

ధర్మసాగర్‌ : ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లు గానే ప్రతి రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యూనిక్‌ కోడ్‌)ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుందని ఏఓ రాజేష్‌ ఆదివారం ఓ ప్ర కటనలో తెలిపారు. భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఇ ఫార్మర్‌ రిజిస్ట్రీ నిర్మించ బ డుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్‌ ఇ ఫార్మర్‌ ఐడీని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు ఏ ర కమైన చట్టబద్ద యాజమాన్య హక్కును కల్పించ దు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఇ రైతు ఫార్మర్‌ ఐడీ కేటాయించబడుతందని అ న్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ అనుసంధానం చేయడం జరుగుతుందని, పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని వెల్లడించారు. రైతు విశిష్ట సంఖ్యను(ఫార్మర్‌ ఐడీ) పొందుటకు మీ ఆధార్‌, భూమి పాస్‌ పుస్తకం, ఆధార్‌కు లింక్‌ చేయబడిన మొబైల్‌ నెంబర్‌ తీసుకొని సమీపంలోని వ్య వసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

అరటి తోట దగ్ధం

ఆత్మకూరు : మండలంలోని అక్కంపేటలో ఓ రైతు తన అరటి తోట దగ్ధమైనట్లు తెలిపాడు. బాధితుడు కడుదుల దేవేందర్‌ కథనం ప్రకారం .. పెద్దాపూర్‌ గ్రామ శివారులో 2 ఎకరాల భూమి ఉండగా అందులో అరటి తోట పెట్టాడు. కాగా అరటి తోట పక్కన పేరుపెల్లి రవీందర్‌కు మొక్కజొన్న చేను ఉండగా శనివారం అట్టి చేనుకు నిప్పంటించగా మంటలు చెలరేగి సమీపంలో ఉన్న అరటి తోటలో అరటి మొక్కలు దగ్ధమయ్యాయని తెలిపారు. రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వెలమ సంక్షేమ సంఘం బలోపేతానికి కృషి

హన్మకొండ చౌరస్తా: వెలమ సంక్షేమ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని ఏఆర్‌ఆర్‌ గార్డెన్‌లో వెలమ సంక్షేమ సంఘం 30వ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పేరాల మధుసూదన్‌ రావు, కాకులమర్రి ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే సత్యనా రాయణ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తామందరం ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సంఘం బలోపేతం చేస్తూ భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా పలు కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement