
పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి
కేయూ క్యాంపస్: వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు పద్ధతులపై అవగాహన అవసరమని కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ విభాగం అధిపతి ప్రొఫెసర్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్సైన్స్ పరిశోధకులకు రీసె ర్చ్ మెథడాలజీపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధకులకు పరిశీలనలో నమూనా పద్ధతులను ఆమె వివరించారు. కేస్ స్టడీ అనేది కీలకంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఆ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, పరిశోధకులు పాల్గొన్నారు.
మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్గా
బొల్లం రమేష్
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్లోని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా బొల్లం రమేష్ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బొల్లం రమేష్ గతంలో ధర్మసాగర్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు.
‘ఎన్ఎంఎంఎస్’కు
విద్యార్థుల ఎంపిక
విద్యారణ్యపురి: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) కోసం గత ఏడాది నవంబర్లో నిర్వహించిన పరీక్షను అప్పటి ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు రాశారు. హనుమకొండ జిల్లాలో 628మంది పరీక్ష రాయగా, అందులో స్కాలర్షిప్నకు 68మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారికి ప్రతి ఏడాది ఒక్కొక్కరికి ఇంటర్ వరకు రూ.12వేల చొప్పున స్కాలర్షిప్ వస్తుంది.
బడిబాట షురూ
విద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి బడీడు పిల్ల లను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మండల విద్యాధికారులు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. ఈనెల 19వ తేదీవరకు ఈ బడిబాట కొనసాగనుంది.
డీఈఈసెట్ అభ్యర్థులకు
9నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఈఈసెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ప్రవేశాలకుగాను ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 14నుంచి 17వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సింటుందని తెలిపారు. పూర్తి వివరాలకు టీజీడీఈఈసెట్ వెబ్సైట్లో చూడాలని సూచించారు.
కొత్తమెనూ ప్రకారం
వంటచేయాలి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని కేజీబీవీ, టీజీఆర్ఈఐఎస్, యూఆర్ఎస్, మోడల్ స్కూళ్లలోని హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం వంట చేయాలని ఇన్చార్జ్ డీఈఓ మధుసూదన్ సూచించారు. కామన్ మెనూపై హసన్పర్తి కేజీబీవీలో శుక్రవారం వంట మనుషులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు వివిధ రకాల వంటకాలు ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. సమావేశంలో జెండర్ ఈ్వకిటీ కోఆర్డినేటర్ సునీత, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు జ్యోతి, స్వప్న పాల్గొన్నారు.
రెండు కేజీబీవీల్లో
ఎంఎల్టీ కోర్సు
విద్యారణ్యపురి: వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, పర్వతగిరి కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం (2025–26) కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్ ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) కోర్సును నూతనంగా ప్రవేశపెట్టినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేజీబీవీలో ప్రథమ సంవత్సరానికి 40 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల బాలికలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి