
పనులు చేసినవారు నిరీక్షిస్తున్నారు..
● హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో వివిధ పనులకు రూ 4.50 లక్షల మంజూరీ ఇచ్చారు. తొలుత 25శాతం నిధులు రూ.లక్షా 50 వేలు అడ్వాన్స్డ్గా విడుదల చేశారు. మిగతా పనులు పూర్తయ్యాయని, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిందని సంబంధిత ఉన్నత పాఠశాల హెచ్ఎం రామారావు తెలిపారు.
● హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పనులు పూర్తయ్యాయి. ఆయా పనులకు అంచనాగా రూ.5.80 లక్షలు మంజూరీ ఇచ్చారు. మొదట 25శాతం నిధులు మాత్రమే విడుదల అయ్యాయని ఆ హైస్కూల్ హెచ్ఎం ఉమ తెలిపారు. పనులు చేసిన వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.