
‘వరంగల్ బస్స్టేషన్’ ఆలస్యంపై అసహనం
తనిఖీ చేసిన ‘కుడా’చైర్మన్, వైస్ చైర్పర్సన్
వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణం ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అలాగే, భద్రకాళి బండ్ పరిసరాలను పరిశీలించారు.