
బంగారం చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్
లక్ష్మీపురం: కల్యాణ మండపంలోని గదిలో పెట్టిన బ్యాగ్లో 8 సవర్ల బంగారం చోరీ చేసిన వ్యక్తిని అరండల్పేట పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాలు.. తాడికొండ మండలం, రావెల గ్రామానికి చెందిన ములుపూరి హనుమంతరావు మే 11వ తేదీన అమరావతి రోడ్డులోని కల్యాణ మండపంలో జరుగుతున్న మేనల్లుడు వివాహానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. పెళ్లి వేడుక సమయంలో హనుమంతరావు భార్య కల్యాణ మండపం గదిలో 8 సవర్ల బంగారు నెక్లెస్తో ఉన్న బ్యాగ్ను పెట్టి బయటకు వెళ్లింది. అయితే కొంత సేపటి తరువాత వచ్చి చూడగా బ్యాగ్లో బంగారం ఆభరణాలు కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల పరిశీలించి ఈనెల 4వ తేదీన అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ డీఎస్పీ అరవింద్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు దర్యాప్తు ప్రారంభించారు. మండపంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించగా పల్నాడు జిల్లా, దాచేపల్లి గ్రామానికి చెందిన గుంజి గోవింద్పై అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు శుక్రవారం రాత్రి బ్రాడీపేట 4వ లైన్లో ఉన్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గోవింద్ను అదుపులో తీసుకుని విచారించారు. విచారణలో మండపంలోని బ్యాగ్ను అందులోని 8 సవర్ల బంగారు ఆభరణాన్ని చోరీ చేసినట్లు అంగీకరించాడు. చోరీ చేసి బంగారు ఆభరణాన్ని తాకట్టు పెట్టి వచ్చిన నగదుతో కొత్త సెల్ఫోన్, అలాగే ద్విచక్రవాహనం ఈఎంఐ చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన డబ్బుతో జల్సాలు చేసినట్లు తెలియజేయడంతో పోలీసులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాన్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకుని గోవింద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెండు రోజుల్లో కేసును దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసిన అరండల్పేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ అభినందించారు.