
తోడికోడళ్లకు మంత్రి మనోహర్ నివాళి
తెనాలిరూరల్: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన తోడికోడళ్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిల మృతదేహాలు శుక్రవారం సాయంత్రం తెనాలికి చేరుకున్నాయి. నందులపేటలోని కవిరాజ పార్కు రోడ్డులో అక్షరగీత విద్యానికేతన్ వద్ద బంధువుల సందర్శనార్ధం మృతదేహాలను ఉంచారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మృతదేహాలకు నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.