
చెట్టును ఢీకొని యువకుడి మృతి
భీమడోలు: ఆగడాలలంక చానల్ రోడ్డులోని వడ్డిగూడెం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. ఆగడాలలంక వీఆర్వో సైదు గోపాలకృష్ణ రెండో కుమారుడు సైదు సాయికృష్ణ గంగాప్రసాద్ స్నేహితుడి రిసెప్షన్కు బైక్ ఏలూరు వెళ్లాడు. పార్టీ ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా వడ్డిగూడెం సమీపం మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టాడు. సాయి కృష్ణ ఎగిరి పక్కనే ఉన్న పంటబోదెలో పడ్డాడు. తల రాయికి తగలడంతో మృతిచెందాడు. శనివారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు గమనించి పోలీసులకు, తండ్రికి సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు.